
పెద్దపల్లి, వెలుగు: కేంద్ర మాజీ మంత్రి దివంగత కాకా వెంకటస్వామి ఫౌండేషన్ ఆధ్వర్యంలో, పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మంగళవారం ముస్లింలకు రంజాన్ సందర్భంగా చీరలు పంపిణీ చేశారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కాకా ఫౌండేషన్ సభ్యుడు సోడాబాపు 200 మంది పేద ముస్లిం మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సోడాబాపు మాట్లాడారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, పెద్దపల్లి మాజీ ఎంపీ డాక్టర్ వివేక్ వెంకటస్వామి ఆశీస్సులతో కాకా ఫౌండేషన్ చేస్తున్న సేవా కార్యక్రమాల్లో ప్రతి సంవత్సరం మాదిరిగానే పేద ముస్లిం మహిళలకు చీరలు పంచామన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు.