
వనపర్తి, వెలుగు: వనపర్తి కోర్టు కొత్త బిల్డింగ్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్ సునీత కోరారు. జిల్లా కోర్టు కాంప్లెక్స్ లో కొత్తగా ఏర్పాటు చేసిన మూడు కార్ పార్కింగ్ షెడ్లు, రెండవ అదనపు కోర్టు హాల్, వైద్య చికిత్సా కేంద్రాన్ని కలెక్టర్ ఆదర్శ్ సురభి, బార్ కౌన్సిల్ అధ్యక్షుడు డి.కిరణ్ కుమార్, న్యాయమూర్తులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కోర్టు ఆవరణలో వైద్య చికిత్సా కేంద్రం ఏర్పాటుతో కోర్టుకు వచ్చే వారితో పాటు న్యాయవాదులు, సిబ్బందికి ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.
వైద్య చికిత్స కేంద్రం, కార్ షెడ్ల ఏర్పాటుకు ఫండ్స్ రిలీజ్ చేసిన కలెక్టర్ కు కృతజ్ఞతలు తెలిపారు. కోర్టు శాశ్వత భవన నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరారు. డీఎల్ఎస్ఏ సెక్రటరీ రజజి, న్యాయమూర్తులు కలార్చన, కవిత, శ్రీలత, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు డి కిరణ్ కుమార్
పాల్గొన్నారు.