కరీంనగర్ జిల్లా హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బొమ్మలు వేసి వదిలేసిన్రు

కరీంనగర్ జిల్లా హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బొమ్మలు వేసి వదిలేసిన్రు
  •     వినియోగంలోకి రాని పీడీయాట్రిక్ అదనపు వార్డు
  •     ఎంతమంది వచ్చినా ఒక్క వార్డులోనే ట్రీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్​

కరీంనగర్, వెలుగు : కరీంనగర్ జిల్లా హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పీడీయాట్రిక్​ అదనపు వార్డును బొమ్మలు వేసి వదిలేశారు. గ్రౌండ్ ఫ్లోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని పిల్లల వార్డులో బెడ్స్​ సరిపోవడం లేదు. దీంతో డాక్టర్లు ఒక్కోబెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఇద్దరి చొప్పున పడుకోబెట్టి ట్రీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్​చేస్తున్నారు. ఫస్ట్ ఫ్లోర్ లో రూ.లక్షలు ఖర్చు చేసి బెడ్స్, పిల్లలను ఆకట్టుకునేలా రంగురంగుల కార్టూన్స్ తో పీడీయాట్రిక్​వార్డును సిద్ధం చేసినప్పటికీ వినియోగంలోకి తీసుకురావడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు.

జిల్లా హాస్పిటల్ ఇటీవల టీచింగ్ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గ్రేడ్​ అయినప్పటికీ సరిపడా డాక్టర్లు, సిబ్బంది లేకపోవడంతోనే అదనపు వార్డును ఉపయోగించుకోవడం లేదని హాస్పిటల్ సిబ్బంది పేర్కొన్నారు. ప్రస్తుత పీడీయాట్రిక్ వార్డులో 38 బెడ్స్ ఉండగా.. 60 మంది వరకు పిల్లలు ట్రీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్​ తీసుకుంటున్నారు. ఎంతమంది వచ్చినా గ్రౌండ్ ఫ్లోర్ లోని ఒక్క వార్డులోనే ట్రీట్ మెంట్ చేస్తుండడంతో పిల్లల తల్లులు, బంధువులతో ఆ వార్డంతా కిటకిటలాడుతోంది.