కర్నాటక స్టార్ క్యాంపెయినర్​గా డీకే అరుణ

కర్నాటక స్టార్ క్యాంపెయినర్​గా డీకే అరుణ

హైదరాబాద్, వెలుగు: కర్నాటక ఎన్నికల ప్రచారం కోసం 40 మంది  స్టార్ క్యాంపెయినర్లను బీజేపీ హై కమాండ్  బుధవారం ప్రకటించింది. ఇందులో మన రాష్ట్రం నుంచి బీజేపీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్, కర్నాటక కో ఇన్​చార్జ్​ డీకే అరుణకు చోటుదక్కింది. ప్రధాని మోడీ, పార్టీ చీఫ్ జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, అమిత్ షా, నిర్మలా సీతారామన్, స్మృతీ ఇరానీ, యూపీ సీఎం యోగీ వంటి హేమాహేమీలు ఉన్న స్టార్ క్యాంపెనర్ల లిస్టులో డీకే అరుణకు చోటుదక్కడంపై పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కర్నాటక ఎన్నికల ప్రచారంలో ఇప్పటికే బీజేపీ నేతలు లక్ష్మణ్, వివేక్ వెంకటస్వామి,  ఎంపీ అర్వింద్,ఈటల, రఘునందనరావు,  జితేందర్ రెడ్డి, గరికపాటి, ఇంద్రసేనారెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాధవి చౌదరి, ఎస్.కుమార్, బండా కార్తీకరెడ్డి బిజీగా ఉన్నారు.