కాంగ్రెస్ నేతలు TRSతో మ్యాచ్ ఫిక్స్ : డీకే అరుణ

కాంగ్రెస్ నేతలు TRSతో మ్యాచ్ ఫిక్స్ : డీకే అరుణ

నరేంద్ర మోడీ సూచనతో పాలమూరు పార్లమెంట్ బరిలో నిలబడ్డానని తెలిపారు డీకే అరుణ. రాష్ట్రంలో అధికార పక్షం నియంత పోకడను అసెంబ్లీలో నిలదీశానన్నారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం సమర్థవంతమైన ప్రతిపక్ష పాత్ర పోషించడంలో.. ఘొరంగా విఫలమై, ప్రజా విశ్వాసాన్ని కోల్పోయిందన్నారు. కాంగ్రెస్ అగ్రనాయకత్వం మొత్తం TRSతో మ్యాచ్ ఫిక్స్ చేసుకొందని.. క్షేత్ర స్థాయి కార్యకర్తలు కూడా TRS వైపు చూస్తుండటంతో తన నిర్ణయం BJP వైపు మళ్లిందని తెలిపారు అరుణ.