రేవంత్, ఈటల భేటీ ఫొటోలు ఉంటే కేటీఆర్ బయటపెట్టాలి

రేవంత్, ఈటల భేటీ ఫొటోలు ఉంటే కేటీఆర్ బయటపెట్టాలి

ఈ నెల 30న హుజూరాబాద్ నియోజకవర్గానికి ఉపఎన్నిక జరగనుంది. ప్రచారానికి  మరి కొద్ది రోజులే ఉండటంతో ప్రధాన పార్టీల నేతలు మాటల యుద్ధానికి దిగుతున్నారు. ఎవరికి వారే గెలుపు  ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ..ఈటల రాజేందర్, రేవంత్ రెడ్డిల మధ్య రహస్య ఒప్పందాలు ఉన్నాయని.. గోల్కొండ రిసార్టులో వీరిద్దరూ రహస్యంగా భేటీ అయ్యారని కేటీఆర్ అన్నారు. అంతేకాదు.. ఏడాదిన్నర తర్వాత కాంగ్రెస్ లో ఈటల చేరుతారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ.
 
రేవంత్, ఈటల భేటీ ఫొటోలు ఉంటే బయటపెట్టాలని కేటీఆర్ కు సవాల్ విసిరారు డీకే అరుణ. బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేయడం టీఆర్ఎస్ పార్టీకి అలవాటేనని అన్నారు. హుజురాబాద్ లో ఓడిపోతామనే భయంతో కుట్రలకు పాల్పడుతోందని చెప్పారు. తనను సీఎం కాకుండా అడ్డుకున్నారనే కోపంతో ఈటలపై కేటీఆర్ నిందలు వేస్తున్నారని అన్నారు.