బీఆర్ఎస్, కాంగ్రెస్ తో తెలంగాణ దివాలానే : డీకే అరుణ

బీఆర్ఎస్, కాంగ్రెస్ తో తెలంగాణ దివాలానే : డీకే అరుణ
  • బీజేపీ నేషనల్​ వైస్ ప్రెసిడెంట్ డీకే అరుణ

గద్వాల, వెలుగు: బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనతో తెలంగాణ దివాలాతీయడం ఖాయమని, అలాంటి పార్టీలతో జాగ్రత్తగా ఉండాలని బీజేపీ నేషనల్​ వైస్ ప్రెసిడెంట్ డీకే అరుణ అన్నారు. బుధవారం మల్లకల్ మండలం సద్దనోన్ పల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీలో చేరారు.

ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడారు. ఓట్ల కోసం వచ్చే   పగటి వేషగాళ్లను నమ్మొద్దని, వారిని నిలదీయాలన్నారు. తొమ్మిదేళ్లలో నిరుపేదలకు ఒక డబుల్ బెడ్ రూమ్ ఇవ్వలేదని ఇప్పుడు మళ్లీ ఓట్ల కోసం వస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో బండల వెంకట్ రాములు, మిర్జాపురం వెంకటేశ్వర్ రెడ్డి, అంజి, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.