వ్యాధుల పట్ల అలర్ట్​గా ఉండాలి: చందూనాయక్​ 

వ్యాధుల పట్ల అలర్ట్​గా ఉండాలి:  చందూనాయక్​ 

కౌడిపల్లి,  వెలుగు :  వర్షాకాలం అయినందున సీజనల్​ వ్యాధులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని మెదక్​ డీఎంహెచ్​వో చందూనాయక్​ సూచించారు. మండల కేంద్రమైన కౌడిపల్లిలో డాక్టర్లు ఫీల్డ్ సర్వే చేస్తున్న సందర్భంలో ఆయన తనిఖీ చేశారు. బీపీ, షుగర్ ​వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం అందించే మందులు, కిట్స్​అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు.

ఇప్పటి వరకు మండలానికి రూ. 1.79 లక్షల మందులు వస్తే 90 శాతం  రోగులకు మందులు పంపిణీ చేశామన్నారు. స్థానిక మురుగు కాల్వను చూసి వెంటనే క్లీన్ చేయించాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట డిప్యూటీ డీఎం హెచ్​వో విజయలక్ష్మి, పీహెచ్​సీ డాక్టర్​ శ్రీకాంత్​, ఎంపీహెచ్​ఈవో మల్లికార్జున్, రాధా కిషన్, సూపర్​వైజర్లు శ్రీధర్ రెడ్డి, రమేశ్, ఏఎన్ఎం చిన్నమ్మ, 
సుమిత్ర  ఉన్నారు.