బోధన్​ డివిజన్​లో డెంగ్యూ కేసులు నమోదు కాకుండా చూడాలి : డీఎంహెచ్​వో రాజశ్రీ

బోధన్​ డివిజన్​లో డెంగ్యూ కేసులు నమోదు కాకుండా చూడాలి : డీఎంహెచ్​వో రాజశ్రీ

బోధన్, వెలుగు : బోధన్​ డివిజన్​లో డెంగ్యూకేసులు నమోదు కాకుండా చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్​వో రాజశ్రీ  సూచించారు. బుధవారం బో ధన్ లోని జిల్లా ఆసుపత్రిలో కీటక జనిత వ్యాధుల నివారణపై  వైద్య సిబ్బందితో నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు.  పీహెచ్​సీ, యూపీహెచ్​సీ సిబ్బంది డైరీ, అడ్వాన్స్​ టూర్​ ప్రోగ్రాంను రిజిస్టర్​లో నమోదు చేయాలన్నారు.

నీటి నిలువ ప్రాంతాలను గుర్తుంచి ఆయిల్ బాల్స్ వేయాలన్నారు. డెంగ్యూ కేసు నమోదు అయిన దగ్గర ఆరోగ్య శిబిరం నిర్వహించాలన్నారు. ఎక్కడైనా డెంగీ పాజిటివ్ వస్తే లైన్ డిపార్ట్​మెంట్​అందరికీ తెలుపాలన్నారు. సమావేశంలో జిల్లా మలేరియా అధికారి డాక్టర్ తుకారం రాథోడ్, డిప్యూటీ డీఎంహెచ్​వో  సమతా, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. 

బోధన్​లో డయాగ్నస్టిక్ సెంటర్​ సీజ్​

బోధన్ పట్టణంలోని డయాగ్నస్టిక్ సెంటర్​ను డీఎంహెచ్​వో రాజశ్రీ సీజ్ చేశారు.  డాక్టర్ గైర్హాజర్​తోపాటు కేంద్రంలో రికార్డులు, పేషెంట్ల రిజిస్ట్రేషన్ సరిగా లేకపోవడంతో మండిపడ్డారు.  కేంద్రంలో సరైన టెక్నిషన్​ సిబ్బంది లేకపోవడంతో డీఎంహెచ్​వో సెంటర్ నిర్వహకులపై అగ్రహించారు. సెంటర్ ను తాత్కాలికంగా సీజ్​ చేస్తున్నట్లు తెలిపారు.  ఆమె వెంట డిప్యూటీ డీఎంహెచ్ వో డాక్టర్ సమత, డాక్టర్​ ప్రవీణ్, వైద్య సిబ్బంది నిర్మల, రవి, దేవేందర్ ఉన్నారు.