
బోధన్, వెలుగు : బోధన్ డివిజన్లో డెంగ్యూకేసులు నమోదు కాకుండా చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్వో రాజశ్రీ సూచించారు. బుధవారం బో ధన్ లోని జిల్లా ఆసుపత్రిలో కీటక జనిత వ్యాధుల నివారణపై వైద్య సిబ్బందితో నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. పీహెచ్సీ, యూపీహెచ్సీ సిబ్బంది డైరీ, అడ్వాన్స్ టూర్ ప్రోగ్రాంను రిజిస్టర్లో నమోదు చేయాలన్నారు.
నీటి నిలువ ప్రాంతాలను గుర్తుంచి ఆయిల్ బాల్స్ వేయాలన్నారు. డెంగ్యూ కేసు నమోదు అయిన దగ్గర ఆరోగ్య శిబిరం నిర్వహించాలన్నారు. ఎక్కడైనా డెంగీ పాజిటివ్ వస్తే లైన్ డిపార్ట్మెంట్అందరికీ తెలుపాలన్నారు. సమావేశంలో జిల్లా మలేరియా అధికారి డాక్టర్ తుకారం రాథోడ్, డిప్యూటీ డీఎంహెచ్వో సమతా, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
బోధన్లో డయాగ్నస్టిక్ సెంటర్ సీజ్
బోధన్ పట్టణంలోని డయాగ్నస్టిక్ సెంటర్ను డీఎంహెచ్వో రాజశ్రీ సీజ్ చేశారు. డాక్టర్ గైర్హాజర్తోపాటు కేంద్రంలో రికార్డులు, పేషెంట్ల రిజిస్ట్రేషన్ సరిగా లేకపోవడంతో మండిపడ్డారు. కేంద్రంలో సరైన టెక్నిషన్ సిబ్బంది లేకపోవడంతో డీఎంహెచ్వో సెంటర్ నిర్వహకులపై అగ్రహించారు. సెంటర్ ను తాత్కాలికంగా సీజ్ చేస్తున్నట్లు తెలిపారు. ఆమె వెంట డిప్యూటీ డీఎంహెచ్ వో డాక్టర్ సమత, డాక్టర్ ప్రవీణ్, వైద్య సిబ్బంది నిర్మల, రవి, దేవేందర్ ఉన్నారు.