చట్టాలు వాళ్లకు వర్తించవా?.. అక్బరుద్దీన్ తీరుపై ఎంపీ లక్ష్మణ్ ఫైర్​

చట్టాలు వాళ్లకు వర్తించవా?.. అక్బరుద్దీన్ తీరుపై ఎంపీ లక్ష్మణ్ ఫైర్​

హైదరాబాద్, వెలుగు: విధుల్లో ఉన్న పోలీస్ అధికారిపై మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ దురుసుగా ప్రవర్తించారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. ఒవైసీ బ్రదర్స్ ఇష్టారీతిన మాట్లాడుతున్నారని, దారుసలాం నుంచి అనుమతి పొందితే తప్ప పాతబస్తీలో తిరిగే పరిస్థితి లేదని ఆయన అన్నారు.

బుధవారం సోమాజిగూడ బీజేపీ మీడియా సెంటర్ లో లక్ష్మణ్ విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్​లో పాత బస్తీ లేదా? చట్టాలు వాళ్లకు వర్తించవా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్​కు పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారన్నారు. అక్బరుద్దీన్ మీద కేసు పెట్టాలని, చర్యలు తీసుకోవాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు.