ముంబై: డాక్టర్లను సాధారణంగా దేవుడు అంటారు. ఈ మాటను నిజం చేశాడు మహారాష్ట్రకు చెందని ఓ డాక్టర్. అప్పుడే పుట్టిన చిన్నారి శ్వాస సంబంధిత సమస్యతో ఇబ్బంది పడుతుంటే.. హాస్పిటల్కు తీసుకెళ్లేందుకు అంబులెన్స్ కూడా లేకపోవడంతో బైక్ పైనే తీసుకుని హాస్పిటల్కు తీసుకెళ్లి ప్రాణాలు కాపాడాడు. మహారాష్ట్రలోని అలీబాగ్ టౌన్లో ఈ ఘటన జరిగింది.
అలీబాగ్కు చెందిన శ్వేతా పటేల్కు శుక్రవారం తెల్లవారుజామున నొప్పులు రావడంతో దగ్గరలోని ఓ హాస్పిటల్కు ఆమె భర్త కేతన్ తీసుకెళ్లాడు. వీరికి గతంలో ఓ బిడ్డ పుట్టినా కొద్ది గంటల్లోనే చనిపోయాడు. దీంతో సరైన సమయంలో సరైన ట్రీట్మెంట్ ఇవ్వకపోవడం ఎంతో కీలకంగా మారింది. ‘‘శ్వేత డయాబెటిక్ పేషెంట్. సుగర్ లెవల్స్ ను కంట్రోల్ లో ఉంచుకునేందుకు ఆమె టైమ్టు టైమ్ మెడిసిన్స్ వేసుకోవాలి”అని కేతన్ చెప్పాడు. శ్వేత మెడికల్ హిస్టరీని దృష్టిలో పెట్టుకుని ఆమెకు మొదటిసారి డెలివరీ చేసిన గైనకాలజిస్టు.. పిడియాట్రిషన్ డాక్టర్ రాజేంద్ర చందోర్కర్ను పిలిపించారు. ఆయన సహకారంతో డెలివరీ పూర్తి చేశారు. 3.1 కేజీల బరువుతో బాబు పుట్టాడు. అయితే ఒక్కసారిగా బాబు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడ్డాడు. అతడి శరీరం రంగు మారిపోతోంది. దీంతో వెంటనే అతడికి నియోనటల్ కేర్ అవసరమైంది. లాక్డౌన్ కారణంగా ఎటువంటి సదుపాయాలు అందుబాటులో లేకపోవడంతో 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న చందోర్కర్ హాస్పిటల్కు టూ వీలర్పైనే తీసుకెళ్లారు. వెంటనే బేబీని అడ్మిట్ చేసుకున్న డాక్టర్.. ట్రీట్మెంట్ మొదలుపెట్టారు. ఆక్సిజన్ సపోర్ట్ అందించారు. 12 గంటల తర్వాత అతడి పరిస్థితి నార్మల్ అయ్యింది. ‘‘ఇది నాకు చాలా గొప్ప అనుభవం. ట్రీట్మెంట్ చేస్తుంటే ఆ బాబు నా వేళ్లు పట్టుకున్నాడు. అతడు సేఫ్గా ఉండాలని, త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా”అని డాక్టర్ చందోర్కర్ చెప్పారు.