లతా మంగేష్క‌ర్ ఆరోగ్యంపై కీల‌క ప్ర‌క‌ట‌న‌

లతా మంగేష్క‌ర్ ఆరోగ్యంపై కీల‌క ప్ర‌క‌ట‌న‌

ప్ర‌ముఖ గాయిని ల‌తా మంగేష్క‌ర్ ఆస్ప‌త్రిలో చేరిన విష‌యం తెలిసిందే. తీవ్ర అనారోగ్యం పాల‌వ్వ‌డంతో గ‌త కొన్నిరోజులుగా ఆమె ఐసీయూ వార్డులో చికిత్స పొందుతున్నారు. అయితే తాజాగా ఆమె హెల్త్ కండిష‌న్ కు సంబంధించి డాక్ట‌ర్లు గుడ్ న్యూస్ చెబుతున్నారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న ల‌తా ఆరోగ్యం కాస్త మెరుగుప‌డిన‌ట్లు ముంబై బ్రీచ్ క్యాండీ ఆస్ప‌త్రి వైద్యులు ప్ర‌క‌టించారు. ల‌తాకు చికిత్స అందిస్తున్న డాక్ట‌ర్ ప్ర‌తిత్ సామ్ ధాని ఈ మేర‌కు ప్ర‌క‌టించారు. దీంతో లతా అభిమానులు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. ఆమె త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షిస్తున్నారు. 

కొన్ని రోజుల క్రితం లతా మంగేష్కర్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. దీంతో ఈ నెల 11న ఆమెను బ్రీచ్ క్యాండీ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి న్యుమోనియా ఉందని తేల్చారు. అప్ప‌ట్నుంచి ఆమె ఐసీయూలోనే ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే, ఆమె ఆరోగ్యంపై వదంతులు చక్కర్లు కొడుతుండడంతో మరోసారి ఆమె ప్రతినిధులు క్లారిటీ ఇచ్చారు. లతా దీదీ ఇంకా ఐసీయూలోనే ఉన్నారని, ఆమెకు చికిత్స కొనసాగుతోందని చెప్పారు. దయచేసి పుకార్లను ప్రచారం చేయొద్దని విజ్ఞప్తి చేశారు.

ఇవి కూడా చ‌ద‌వండి: 

డ్రెస్సింగ్ రూమ్ లో విరాట్ చిందులు  

ఆదివారం రాష్ట్రంలో ప‌లుచోట్ల వ‌ర్షాలు