
ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో డాక్టర్లను నియమించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం డాక్టర్ల పోస్టులు భర్తీ చేయకపోవడాన్ని నిరసిస్తూ బుధవారం రిమ్స్సూపర్స్పెషాలిటీ హాస్పిటల్ ముందు ఒక రోజు దీక్షా కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ప్రజలకు మెరుగైన వైద్యం అందించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం రూ. 120 కోట్లతో ఆదిలాబాద్ కు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను మంజూరు చేసిందని, కానీ రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్లను నియమించకుండా నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. ప్రజలకు అధునాతన వైద్యం అందని ద్రాక్షగానే మిగిలిపోయిందన్నారు. పేద ప్రజల బాధలు పట్టించుకోని స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్న ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. దీక్షలో బీజేపీ నాయకులు అధినత్, చంద్ర, విజయ్, దినేశ్ మటోలియా, జోగు రవి, రఘుపతి ఉన్నారు.