బాసర ట్రిపుల్ ఐటీలో కుక్కల స్వైర విహారం

బాసర ట్రిపుల్ ఐటీలో కుక్కల స్వైర విహారం

ఇద్దరు ఇంజినీరింగ్ స్టూడెంట్లకు గాయాలు

భైంసా, వెలుగు : నిర్మల్​జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో కుక్కలు స్వైర విహారం చేశాయి. బుధవారం సాయంత్రం 6 గంటలకు కుక్కల దాడి జరిగినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. క్యాంపస్ లో రెండో సంవత్సరం ఇంజినీరింగ్​చదువుతున్న ఇద్దరు విద్యార్థులకు గాయాలు కాగా, స్థానిక దవాఖానాలో ట్రీట్​మెంట్​చేసి పంపించారు. పరీక్షలు జరుగుతుండగా..చికిత్స తర్వాత స్టూడెంట్లు వచ్చి పరీక్షలు రాశారని అధికారులు తెలిపారు. కుక్కల దాడితో విద్యార్థులు భయపడుతున్నారు. గతంలోనూ విద్యార్థులను పందులు, కుక్కలు గాయపరిచాయని చెబుతున్నారు.