సీఎం కేసీఆర్ ఇచ్చిన ఎన్నికల హామీ మేరకు హోంగార్డులను రెగ్యులరైజ్ చేయాలని హోంగార్డ్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సకినాల నారాయణ డిమాండ్ చేశారు. హోంగార్డుల డిమాండ్ల సాధనలో భాగంగా ఆయన ఉద్యోగుల కుటుంబాలతో కలిసి వెళ్లి దోమల్గూడ పోలీస్స్టేషన్లో ఆందోళనలు చేశారు.
డిమాండ్ల సాధన కోసం ధర్నా చౌక్లో శాంతియుతంగా నిరసనలు తెలపాలని భావిస్తే.. ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం అన్యాయమని ఆయన అన్నారు. విధి నిర్వహణలో మరణించిన హోంగార్డుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాలు చేపట్టాలన్నారు.
ALSO READ :బుల్లెట్ బండిపై అమ్మవారు.. కమ్మని ప్రసాదాలతో పూజలు
కోర్టు కేసులు పరిష్కారం అయిన వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని రిటైర్డ్ అయిన హోంగార్డులకు డబల్ బెడ్ రూమ్ ఇళ్లతో పాటు 10 లక్షలు ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. వీటిని పరిష్కరించాలని కోరారు. త్వరలో హైకోర్టు తీసుకొని ఛలో ధర్నా చౌక్ లో ఆందోళనలు నిర్వహిస్తామని చెప్పారు.