దోమలగూడలో ఉద్రిక్తత.. హోంగార్డులు, కుటుంబ సభ్యుల ధర్నా..

దోమలగూడలో ఉద్రిక్తత.. హోంగార్డులు, కుటుంబ సభ్యుల ధర్నా..

సీఎం కేసీఆర్​ ఇచ్చిన ఎన్నికల హామీ మేరకు హోంగార్డులను రెగ్యులరైజ్​ చేయాలని హోంగార్డ్స్​ అసోసియేషన్​ అధ్యక్షుడు  సకినాల నారాయణ డిమాండ్​ చేశారు. హోంగార్డుల డిమాండ్ల సాధనలో భాగంగా ఆయన ఉద్యోగుల కుటుంబాలతో కలిసి వెళ్లి దోమల్​గూడ పోలీస్​స్టేషన్​లో ఆందోళనలు చేశారు.  

డిమాండ్ల సాధన కోసం ధర్నా చౌక్​లో శాంతియుతంగా నిరసనలు తెలపాలని భావిస్తే.. ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం అన్యాయమని ఆయన అన్నారు. విధి నిర్వహణలో మరణించిన హోంగార్డుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాలు చేపట్టాలన్నారు. 

ALSO READ :బుల్లెట్ బండిపై అమ్మవారు.. కమ్మని ప్రసాదాలతో పూజలు

కోర్టు కేసులు  పరిష్కారం అయిన వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని రిటైర్డ్ అయిన హోంగార్డులకు డబల్ బెడ్ రూమ్ ఇళ్లతో పాటు 10 లక్షలు ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్​ చేశారు. వీటిని పరిష్కరించాలని కోరారు.  త్వరలో హైకోర్టు  తీసుకొని ఛలో ధర్నా చౌక్ లో ఆందోళనలు నిర్వహిస్తామని చెప్పారు.