ఓటమితో కుంగిపోవద్దు.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుదాం

ఓటమితో కుంగిపోవద్దు..  ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుదాం

నిజామాబాద్​రూరల్, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ఎదురైనంత మాత్రాన కార్యకర్తలు ఆత్మ స్థైర్యాన్ని కోల్పోవద్దని, రెట్టించిన ఉత్సాహంతో పని చేయాలని మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్​సూచించారు. 

బుధవారం నియోజకవర్గ ముఖ్య నేతలతో సమావేశమై ఓటమికి గల కారణాలపై విశ్లేషించారు. బాజిరెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల్లో గెలుపోటములు సాధారణమని, రాజకీయాల్లో ఉన్నవారు రెండింటిని సమానంగా తీసుకోవాలన్నారు. కాంగ్రెస్​ ప్రభుత్వం లెక్కకుమించి హామీలనిచ్చి అధికారంలోకి వచ్చిందని, ఆ హమీలన్నీ అమలయ్యేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. 

ఇందుకోసం కార్యకర్తల సహకారం కావాలని కోరారు. ఎల్లప్పుడు కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని, ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ఆదుకుంటానని హామీ ఇచ్చారు. త్వరలో జరిగే స్థానిక సంస్థలు, పార్లమెంట్​ఎన్నికల్లో సత్తా చాటాలని కోరారు. సమావేశంలో ఐడీసీఎంఎస్ ​చైర్మన్​ సాంబారి మోహన్, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.