కవిత ఇష్యూపై మాట్లాడొద్దు : బీఆర్ఎస్​ హైకమాండ్​ఆదేశం

కవిత ఇష్యూపై మాట్లాడొద్దు : బీఆర్ఎస్​ హైకమాండ్​ఆదేశం
  • మంత్రులు, ప్రజాప్రతినిధులకు ప్రగతి భవన్ నుంచి ఆదేశాలు

హైదరాబాద్, వెలుగు: ఢిల్లీ లిక్కర్​స్కామ్, ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణపై ఎవ్వరూ మాట్లాడొద్దని మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులను బీఆర్ఎస్​హైకమాండ్​ఆదేశించింది. శనివారం మధ్యాహ్నం ప్రగతి భవన్​నుంచి పార్టీ నేతలకు ఈ మేరకు ఫోన్లు చేసి ఈ వ్యవహారంలో ఎట్టి పరిస్థితుల్లోనూ మాట్లాడొద్దని తేల్చిచెప్పారు. టీవీ చర్చల్లోనూ లిక్కర్​స్కామ్​పై ఎలాంటి కామెంట్లు చేయొద్దని స్పష్టం చేశారు.

కవిత అరెస్టుపై రెండు రోజుల క్రితం బీజేపీ స్టేట్​చీఫ్​బండి సంజయ్​చేసిన వ్యాఖ్యలపైనే నిరసనలు, ఆందోళనలు, దిష్టిబొమ్మ దహనాలు చేయాలని ఆదేశించారు. ఈడీ విచారణ రాజకీయ కక్షసాధింపు చర్యే తప్ప లిక్కర్​స్కామ్​ అనేదే జరగలేదన్నట్టుగా కౌంటర్​చేయాలని సూచించారు.