తిరుమలలో రాజకీయ ప్రసంగాలు వద్దు

తిరుమలలో రాజకీయ ప్రసంగాలు వద్దు

బిజేపి రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి

తిరుపతి: పవిత్రమైన తిరుమలలో కొంత మంది రాజకీయ ప్రసంగాలు చేస్తున్నారని.. ఇది మంచి పద్ధతి కాదని బిజేపి రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.  దయచేసి ఇక్కడ రాజకీయాలు మాట్లాడడం మంచిది కాదన్నారు. భక్తులు చెల్లిస్తున్న కానుకల రూపంలో నడుస్తున్న గొప్ప ధార్మిక సంస్థ తిరుమల అని ఆయన పేర్కొన్నారు. శ్రీవారి సొమ్ములను  సెక్యూరిటీ పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర బాడ్ల రూపంలో పెట్టడం మంచిపద్దతి కాదు.. వడ్డీ ఎక్కువ వస్తుందనే సాకు చూపి భక్తుల మనోభావాలను దెబ్బతీసేవిధంగా ఉన్న ప్రతిపాదనను టిటిడి వెంటనే విరమించుకోవాలని ఆయన కోరారు. అలాగే అన్యమతస్తులకు డిక్లరేషన్ అవసరం లేదని టీటీడీ చైర్మన్ చెప్పడం భావ్యం కాదన్నారు. వ్యక్తుల కోసం‌ సాంప్రదాయాలను మార్చకండి ఆయన సూచించారు.