హైదరాబాద్, వెలుగు: రాష్ర్టంలోని డిగ్రీ కాలేజీల్లోప్రవేశాలకు డిగ్రీ ఆన్ లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) నోటిఫికేషన్ నుసోమవారం ఉన్నత విద్యామండలి రిలీజ్ చేయనున్నది. ఉదయం 11గంటలకు హైయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్లో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నట్టుదోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు. జులై ఫస్ట్ నుంచే ఆన్ లైన్ లో అప్లికేషన్లు ప్రారంభిస్తామన్నారు. ఇంటర్ ఫలితాల మరుసటి రోజే దోస్త్ నోటిఫికేషన్ ఇవ్వాలని ముందుగా భావించామని కానీ అందరూ రిజల్స్ట్ చూసుకునేందుకు టైమ్ ఇస్తే మంచిదని నాలుగు రోజులు ఆలస్యంగా నోటిఫికేషన్ ఇస్తున్నట్లు చెప్పారు.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

