ఇవాళే ‘దోస్త్’ నోటిఫికేషన్

ఇవాళే ‘దోస్త్’ నోటిఫికేషన్

డిగ్రీ ప్రవేశాల కోసం ఇవాళ ‘దోస్త్’ నోటిఫికేషన్ విడుదల కానుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు ఉన్నత విద్యామండలి కార్యాలయంలో నోటిఫికేషన్ను అధికారులు విడుదల చేయనున్నారు. దీని ద్వారా రాష్ట్రంలోని ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ, శాతవాహన యూనివర్సిటీల పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో సీట్లు భర్తీ చేస్తారు. బీఏ, బీకాం, బీఎస్సీ ఇతర డిగ్రీ కోర్సుల్లో దాదాపు 4లక్షల 25 వేల సీట్లను భర్తీ చేయనున్నారు. వీటిని విడతల వారీగా సీట్ల భర్తీ జరగనుంది. దోస్త్  వెబ్ సైట్ , టీఎస్  ఫోలియో యాప్ , యూనివర్సిటీల వెబ్ సైట్ల ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునేలా ఏర్పాట్లు చేశారు.