పెళ్లయిన రెండు నెలలకే నవ వధువు సూసైడ్

పెళ్లయిన రెండు నెలలకే నవ వధువు సూసైడ్
  • వరకట్న వేధింపులే కారణం

కూకట్​పల్లి, వెలుగు: వరకట్న వేధింపులతో ఓ నవ వధువు ఆత్మహత్య చేసుకుందని కేపీహెచ్​బీ పోలీసులు తెలిపారు. ఖమ్మం జిల్లా కొణిజెర్లకు చెందిన మాలోతు పూజిత(19)కు శ్రీనుతో గత ఏప్రిల్​లో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో రూ.11 లక్షల విలువైన బంగారం, ఇంటి సామగ్రి కట్నంగా ఇచ్చారు. కొత్త దంపతులు కేపీహెచ్​బీ కాలనీ టెంపుల్ బస్టాప్​సమీపంలో ఉంటున్నారు. అయితే పెళ్లయిన కొన్ని రోజుల నుంచే పూజితను ఆమె భర్తతోపాటు అత్తామామ, మరదలు, బావ, అతని భార్య అదనంగా రూ.10 లక్షలు కట్నం తీసుకురావాలని వేధిస్తున్నారు. 

కొంత సమయం ఇస్తే ఇస్తామని పూజిత కుటుంబసభ్యులు ఒప్పుకున్నారు. అయినా వేధింపులు ఆగకపోవడంతో శనివారం రాత్రి ఆమె ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. శ్రీను పూజిత తల్లికి ఫోన్​చేసి, ఉరేసుకున్నట్లు చెప్పాడు. మృతురాలి కుటుంసభ్యులు ఆదివారం కేపీహెచ్​బీ పోలీస్​స్టేషన్​కు వెళ్లి, అత్తింటి వేధింపులతోనే పూజిత సూసైడ్​చేసుకుందని ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.