రామచంద్రాపురం, వెలుగు: దేశంలోని పబ్లిక్ సెక్టార్ యూనిట్లను కేంద్ర ప్రభుత్వమే కాపాడుతోందని, కొంతమంది ప్రతిపక్షాల నేతలు ప్రభుత్వ సంస్థలపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి డాక్టర్మహేంద్ర నాథ్ పాండే అన్నారు. రాహుల్ గాంధీ జోడో యాత్రలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తున్నామంటూ బురద జల్లుతున్నాడని ఆరోపించారు. పబ్లిక్ సెక్టార్ యూనిట్ల పరిశీలనలో భాగంగా గురువారం ఆయన సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలోని బీహెచ్ఈఎల్ను విజిట్చేశారు. జీరో వన్ బ్లాక్, న్యూ బ్లేడ్షాప్లో పర్యటించి అక్కడి అధికారులతో సమావేశమయ్యారు.
బీహెచ్ఈఎల్ఉత్పత్తులు, చేపట్టబోయే ప్రాజెక్టులపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా తీసుకున్న నిర్ణయాల వల్లే నేడు స్వదేశంలోనే అన్ని రకాల ఉత్పత్తులు తయారు చేసుకోగలుగుతున్నామన్నారు. బీహెచ్ఈఎల్ను ప్రైవేటుపరం చేసే ప్రసక్తే లేదని, ఇప్పటి వరకు థర్మల్ వ్యవస్థకే పరిమితమైన బెల్..హైడ్రోజన్ గ్యాస్, డిఫెన్స్సెక్టార్లోకి కూడా ప్రవేశించి లాభాల్లో ఉందన్నారు. భారీ పరిశ్రమల శాఖ జాయింట్ సెక్రెటరీ విజయ్ మిట్టల్, బీహెచ్ఈఎల్ సీఎండీ నలిన్ సింఘాల్, డైరెక్టర్ రేణుక గెర, ఈడీ వరదరాజన్
పాల్గొన్నారు.