మూడేండ్లలో పూర్తి స్థాయిలో ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఏర్పాటు : తుమ్మల నాగేశ్వరరావు

మూడేండ్లలో పూర్తి స్థాయిలో ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఏర్పాటు : తుమ్మల నాగేశ్వరరావు
  • అగ్రికల్చర్​ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లాలోని పాల్వంచలో ఏర్పాటు చేయనున్న డాక్టర్​ మన్మోహన్​ సింగ్​ఎర్త్​ సైన్సెస్​ యూనివర్సిటీ మూడేండ్లలో పూర్తి స్థాయిలో రూపుదిద్దుకుంటుందని అగ్రికల్చర్​ మినిస్టర్​ తుమ్మల నాగేశ్వర రావు పేర్కొన్నారు. ఎర్త్​ సైన్సెస్​ యూనివర్సిటీని సీఎం రేవంత్​ రెడ్డి ఈ నెల 2వ తేదీన ప్రారంభించనున్నారు. 

సీఎం పర్యటన ఏర్పాట్లను ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, పాయం వెంకటేశ్వర్లు, జారే ఆదినారాయణ, కలెక్టర్​ జితేశ్​​ వి పాటిల్​, ఎస్పీ బి. రోహిత్​ రాజు, పలు శాఖల జిల్లా అధికారులతో కలిసి ఆదివారం పరిశీలించారు. అనంతరం ఆఫీసర్లతో రివ్యూ మీటింగ్​ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం పర్యటన ఏర్పాట్లు ఘనంగా ఉండాలని ఆఫీసర్లను ఆదేశించారు.