ఒకే డాక్టర్.. 20 వేలకు పైగా సర్జరీలు..మెడికవర్ కార్డియాలజిస్టు ఘనత

ఒకే డాక్టర్.. 20 వేలకు పైగా సర్జరీలు..మెడికవర్  కార్డియాలజిస్టు ఘనత

పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్‌‌లోని మెడికవర్ దవాఖాన సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్టు డాక్టర్​ ప్రమోద్ కుమార్ కుచ్చులకంటి విశిష్ఠ మైలురాయిని అందుకున్నారు. రెండు దశాబ్దాల్లో 20 వేలకు పైగా పీటీసీఏ(స్టంట్) శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేసిన ఆయన, వాటిలో 3 వేలకు పైగా రోగులను క్రమపద్ధతిలో ఫాలో-అప్ చేసిన అరుదైన రికార్డును సృష్టించారు. 

ఈ సందర్భంగా మంగళవారం మీడియాతో మాట్లాడారు. విశ్వాసం, ధైర్యంతో చికిత్స  అందించడమే తమ లక్ష్యమన్నారు. మెడికవర్ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్​ అనిల్ కృష్ణ మాట్లాడుతూ.. గుండె ఆరోగ్యాన్ని నిలబెట్టడంలో డాక్టర్​ ప్రమోద్  ఫాలో -అప్ పద్ధతి విశేషమైందన్నారు. దేశంలోని 16 నగరాల్లో 24 దవాఖానలతో మెడికవర్ గ్రూప్ విస్తరించి ఉన్నదని చెప్పారు.