
- స్టేట్ డైరెక్టర్ డాక్టర్ రవీందర్ నాయక్
నిజాwమాబాద్, వెలుగు: జాతీయ మెడికల్ కౌన్సిల్ గైడ్లైన్స్ ప్రకారం మెడికల్ కాలేజీలో వసతులు ఏర్పాటు చేసుకోవాలని రాష్ట్ర వైద్యశాఖ డైరెక్టర్ డాక్టర్ రవీందర్నాయక్ సూచించారు. సౌకర్యాల పెంపునకు కావాల్సిన ప్రతిపాదనలు కలెక్టర్ ద్వారా పంపాలన్నారు. గురువారం ఆయన నిజామాబాద్లోని మెడికల్ కాలేజీకి అనుబంధంగా నడుస్తున్న గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ను పరిశీలించారు. కాలేజీలోని ఫిజియాలజీ, అనాటమీ, హెమటాలజీ విభాగాలు, ల్యాబ్స్, లైబ్రరీ, లెక్చర్ హాల్స్ చూశారు.
అనంతరం కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డితో కలిసి మీటింగ్ నిర్వహించారు. ప్రతి రోజు వస్తున్న ఓపీ, డాక్టర్ల సంఖ్య, ఖాళీలు, వసతుల గురించి ఆరా తీశారు. సర్కార్ హాస్పిటల్స్ ద్వారా రోగులకు మెరుగైన సేవలు అందించాలన్నారు. కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి మాట్లాడుతూ, మెడికల్ స్టూడెంట్స్ సంఖ్యకు అనుగుణంగా ప్రొఫెసర్ల సంఖ్య ఉండాలని కోరారు. ఇక నుంచి తాను రెగ్యూలర్గా తనిఖీ చేస్తానన్నారు. హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్, కాలేజీ ప్రిన్సిపాల్ శివప్రసాద్, డీఎంహెచ్వో డాక్టర్ రాజశ్రీ పాల్గొన్నారు.