మూడు నెలలు 19 అసెంబ్లీ సెగ్మెంట్లకు మంచి నీళ్లు బంద్

మూడు నెలలు 19 అసెంబ్లీ సెగ్మెంట్లకు మంచి నీళ్లు బంద్

కల్వకుర్తి ప్రమాదంతో మిషన్ భగీరథపై ఎఫెక్ట్

నాగర్​ కర్నూల్, వెలుగు: కల్వకుర్తి పంపుహౌస్​ మునిగిపోవడంతో ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. కల్వకుర్తి ప్రాజెక్టులోని ఎల్లూరు రిజర్వాయర్​ నుంచి మిషన్​ భగీరథ వాటర్​ ట్రీట్​మెంట్​ ప్లాంట్ (డబ్ల్యూటీపీ)కు నీటిని తరలించే ప్రక్రియకు పూర్తిగా బ్రేక్​ పడింది. రెగ్యులర్​గా కల్వకుర్తి ఫస్ట్​ పంపుహౌస్​ నుంచి 0.36 టీఎంసీ కెపాసిటీ ఉన్న ఎల్లూరు రిజర్వాయర్​లోకి నీటిని ఎత్తిపోస్తారు. అక్కడి నుంచి ఎల్లూరు డబ్ల్యూటీపీకి నీటిని తరలించి.. దాదాపు 19 అసెంబ్లీ సెగ్మెంట్లు, 3,008 ఆవాసాలకు మంచి నీళ్లు అందిస్తారు. కానీ ఇప్పుడు పంపుహౌస్​ మునిగిపోవడంతో ఎల్లూరులోకి లిఫ్టింగ్​ ఆగిపోయింది. పంపులు నడవడానికి రెండు, మూడు నెలలు పడుతుందన్న అంచనాలు ఉన్నాయి. దీంతో అప్పటిదాకా 19 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో మంచినీటికి కొరత ఏర్పడనుంది. ఈ విషయం తెలియడంతో గ్రామాలు, పట్టణాల్లో జనం ఆందోళనలో పడ్డారు.

బోర్లు, ఇతర స్కీంలతో ఆల్టర్నేట్..

ఇప్పట్లో కల్వకుర్తి నీళ్లు వచ్చే చాన్స్​ లేకపోవడంతో గ్రామాలు, మున్సిపాలిటీల్లో మంచినీళ్ల కోసం ఆల్టర్నేట్​ ఏర్పాట్లపై దృష్టి సారించారు. బోర్లలో మోటార్లు దింపి, రన్నింగ్ ​కండిషన్​లో ఉంచుకోవాలని ఆర్​డబ్ల్యూఎస్​ అధికారులు సర్పంచులు, మున్సిపల్​కమిషనర్లకు ఫోన్లు చేసి చెప్తున్నారు. కల్వకుర్తి మూడో లిఫ్ట్​ గుడిపల్లిగట్టు రిజర్వాయర్​కు సమీపంలో ఉన్న మిషన్​ భగీరథ డబ్ల్యూటీపీకి వెంటనే పైప్​లైన్లు వేసి నీటిని సరఫరా చేయాలని, అక్కడే నీళ్లను శుద్ధి చేసి ఊర్లకు సరఫరా చేయాలని భావిస్తున్నారు. గుడిపల్లిగట్టులో నీళ్లు తగ్గిపోతే జొన్నలబొగడ రిజర్వాయర్​ నుంచి నీటిని తరలించే విషయమై చర్చిస్తున్నారు. మొత్తంగా మూడు వేల ఆవాసాలకు మంచి నీళ్లు అందక అవస్థలు నెలకొననున్నాయి.

For More News..

నైట్‌‌ రైడర్స్‌ తో సన్‌‌ రైజర్స్‌ ఢీ