
- గ్రేటర్ పరిధిలో నీటి సమస్య రాకుండా వాటర్బోర్డు చర్యలు
- రూ.1.32 కోట్లతో మల్లన్నసాగర్ నుంచి ముర్మూర్ట్రీట్మెంట్ప్లాంట్ వరకు కొత్తగా పైప్లైన్
- శామీర్ పేట, జీడిమెట్ల, మేడ్చల్, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి ప్రాంతాలకు సరఫరా
హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తాగునీటి సమస్య రాకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. సరఫరాలో సమస్యలు ఉన్న ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా అందించాలని నిర్ణయించింది. ఉస్మాన్సాగర్, హిమాయత్సార్కాండ్యూట్పై వర్టికల్ ట్రీట్మెంట్ప్లాంట్లు నిర్మించి పరిసర ప్రాంతాలకు నీటి సరఫరా చేయాలని భావిస్తోంది. కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, మేడ్చల్, శామీర్పేటతోపాటు ఔటర్రింగ్రోడ్పరిసర ప్రాంతాల్లో నీటి ఎద్దడి రాకుండా చుట్టుపక్కల రిజర్వాయర్ల నుంచి నీటిని అందించేందుకు వాటర్బోర్డు అధికారులు రెడీ అవుతున్నారు.
మల్లన్న సాగర్ నుంచి 100 ఎంఎల్ డీల నీటిని తరలించేందుకు ఇప్పటికే మిషన్ భగీరథ, ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సంప్రదింపులు జరిపారు. ఎల్లంపల్లి నుంచి సిటీకి తరలిస్తున్న గోదావరి జలాల్లో 32 ఎంజీడీల నీటిని ఆర్ డబ్ల్యూఎస్, మిషన్భగీరథ అధికారులు తీసుకుంటున్నారు. ఈ నీటిని గజ్వేల్, ఆలేరు, భువనగిరి, బీబీనగర్తదితర ప్రాంతాల ప్రజలకు అందిస్తున్నారు. అందుకు బదులుగా మల్లన్న సాగర్నుంచి100ఎంఎల్డీల నీటిని తరలించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఇందుకోసం మల్లన్న సాగర్ నుంచి ముర్మూర్లోని నీటి శుద్ధి కేంద్రానికి రూ.1.32 కోట్లతో పైప్లైన్ నిర్మాణం చేపడుతున్నారు.
పనులు పూర్తయిన వెంటనే మల్లన్నసాగర్ నుంచి 100ఎల్ఎల్డీల నీటిని శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, మేడ్చల్, శామీర్పేటతోపాటు ఓఆర్ఆర్పరిధిలోని మరికొన్ని ప్రాంతాలకు సరఫరా చేయనున్నారు. ఇది కాకుండా ఉస్మాన్సాగర్నుంచి 90.92 ఎంఎల్డీ, హిమాయత్సాగర్ నుంచి 25.54 ఎంఎల్డీ, సింగూరు నుంచి 491.19 ఎంఎల్డీ, కృష్ణా ప్రాజెక్టు మూడు దశల నుంచి 1254.37 ఎంఎల్డీ, గోదావరి ప్రాజెక్టు ద్వారా 740.27 ఎంఎల్డీ నీటిని అందిస్తున్నట్టు అధికారులు తెలిపారు.
12 గంటల్లోపే ఇంటి ముందుకు ట్యాంకర్
బోర్డు పరిధిలో ఇప్పటి వరకు 640 ట్యాంకర్లు ఉండగా, తాజాగా ఆ సంఖ్యను 840కు పెంచినట్లు వాటర్ బోర్డు అధికారులు తెలిపారు. ఆర్టీఏతో కలిసి మరికొన్ని ట్యాంకర్లను సమకూర్చుకుంటున్నట్లు చెప్పారు. రెండు, మూడు రోజుల్లో బుక్ చేసుకున్న12 గంటల్లోపే ట్యాంకర్ అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ట్యాంకర్ల సరఫరా ఏప్రిల్ నెలలో 2.50 లక్షలకు చేరే అవకాశం ఉందని, మే, జూన్ నెలల్లో 3 లక్షలకు పెరగొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. డెయిలీ ట్యాంకర్ల ద్వారా పగలు 7,164 ట్రిప్పులు, రాత్రి సమయాల్లో 608 ట్రిప్పుల ద్వారా నీటిని అందిస్తున్నట్లు చెప్పారు.