రేపు సిటీలో తాగునీటి సరఫరాకు అంతరాయం

రేపు సిటీలో తాగునీటి సరఫరాకు అంతరాయం
  • మంజీరా వాటర్ సప్లై పైప్ లైన్ పనుల వల్ల అంతరాయం
  • గురువారం ఉదయం 6 నుంచి శుక్రవారం సాయంత్రం 6 వరకు మరమ్మత్తు పనులు

 హైదరాబాద్: రేపు సిటీలో పలుచోట్ల మంచినీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. మంజీరా వాటర్ సప్లై ఫేజ్- II పనుల్లో భాగంగా 1500 ఎంఎం డయా పిఎస్సి పైప్‌లైన్‌ను మార్చడానికి జంక్షన్ పనులను చేపడుతున్నారు.పటాన్ చెరు నుండి హైదర్‌నగర్ వరకు గల పంపింగ్ మెయిన్, ఎంఎస్ పైప్ లైన్‌ మదీనాగూడ వద్ద వరద నీటి కాలువ మరియు ఇతర లీకేజీ పనుల నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు అధికార వర్గాలు ప్రకటించాయి. ఈ నేపధ్యంలో 27వ తేదీ గురువారం ఉదయం 6 గంటల నుండి  28వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటల వరకు మొత్తం 36 గంటల పాటు ఈ పనులు కొనసాగుతున్నందున తాగునీటి సరఫరాకు కొన్ని ప్రాంతాలలో అంతరాయం ఏర్పడుతుంది.

అంతరాయం ఏర్పడే ప్రాంతాలు: 

ఓ అండ్ ఎం డివిజన్ నెంబర్ 15 - గంగారాం, దీప్తీశ్రీ నగర్, కెఎస్ఆర్ ఎన్ క్లేవ్, అపర్ణ హిల్స్, ఆదర్శ్ నగర్, శాంతి నగర్, మియాపూర్, మైత్రినగర్, మదీనాగూడ, ఉషోదయ నగర్,
వైశాలి నగర్, రామకృష్ణ నగర్, సాయిరాం కాలనీ, మియాపూర్ క్రాస్ రోడ్స్, మాతృ శ్రీ నగర్, రాజారాం కాలనీ, అంబేద్కర్ నగర్, జనప్రియ ఫేజ్ 1 & 2, మియాపూర్ విలేజ్, మాధవ్ నగర్, భాను టౌన్ షిప్, నంది
కోఆపరేటివ్ సొసైటీ, హుడా మయూరి నగర్, ఎస్సీ బోస్ నగర్, సిర్లా గార్డెన్స్, ఆర్బిఆర్ బాలాజీ నగర్, ఆదిత్య నగర్, శ్రీరంగపురం.

ఓ అండ్ ఎం డివిజన్ నం 9 - హైదర్ నగర్, అడ్డగుట్ట, నిజాంపేట్ మెయిన్
రోడ్, కెపిహెచ్‌బి కాలనీలోని వసంత్ నగర్, రామ్ నరేష్ నగర్.

ఓ అండ్ ఎం డివిజన్ నం 32 - బొల్లారం మున్సిపాలిటీ, ఐలాపుర్ గ్రామం, గండి గూడెం, సుల్తాన్‌పూర్, కిష్టారెడ్డి పేట్, పటేల్‌ గూడ గ్రామం.

ఓ అండ్ ఎం డివిజన్ నం 6 పరిధిలో ఎస్.అర్. నగర్, ఎర్రగడ్డ ప్రాంతాల్లో లో ప్రెజర్ తో నీరు వస్తుంది.

నీటి సరఫరాలో అంతరాయం కలగనున్న ప్రాంతాల్లోని వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.