- రేపు ఉదయం 6 నుంచి ఎల్లుండి సాయంత్రం 6 గంటల వరకు.. నీటి సరఫరా బంద్
హైదరాబాద్: వెలుగు: నగరంలో పలు చోట్ల ఈనెల 16వ తేదీన ఉదయం 6 గంటల నుంచి 17వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు నల్లా నీళ్లు బంద్ కానున్నాయి. మంచినీటి సరఫరా చేస్తున్న కృష్ణ డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్ (కేడీడబ్ల్యూఎస్పీ) ఫేజ్ 1కి సంబంధించి మిరాలం ఆలియాబాద్ ఆఫ్ టెక్ వద్ద 1,200 ఎంఎం జంక్షన్ పనుల కారణంగా అంతరాయం కలగనుందని వాటర్ బోర్డు అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
తాగునీటి సరఫరాలో జరిగే అంతరాయాన్ని గుర్తించి ప్రజలు ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించి సహకరించాలని వాటర్ బోర్డు అధికారులు కోరారు.