బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2 అంత్యక్రియల్లో పాల్గొనేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లండన్కు బయలుదేరి వెళ్లారు. ఈ నెల 19న ఎలిజబెత్ 2 అంత్యక్రియలు జరగనుండగా.. భారత ప్రభుత్వం తరపున సంతాపాన్ని తెలియజేయడానికి రాష్ట్రపతి లండన్కు వెళ్లారు. భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ సెప్టెంబర్ 12నే ఢిల్లీలోని బ్రిటిష్ హై కమిషన్ కార్యాలయానికి వెళ్లి భారత్ తరఫున సంతాపాన్ని తెలియజేశారు.
President Droupadi Murmu emplanes for London, United Kingdom to attend the State Funeral of Queen Elizabeth II and offer condolences on behalf of the Government of India. pic.twitter.com/CacjmyxFJd
— ANI (@ANI) September 17, 2022
క్వీన్ ఎలిజబెత్ 2 మృతికి సంతాప సూచకంగా భారతదేశం సెప్టెంబర్ 11న జాతీయ సంతాప దినం నిర్వహించింది. సెప్టెంబర్ 8న 96 ఏళ్ల వయసులో వృద్దాప్య సమస్యలతో బాధపడుతూ ఎలిజబెత్ 2 కన్నుమూశారు. వెస్ట్మినిస్టర్ అబేలో రాణి అంత్యక్రియలు జరగనున్నాయి.