ముంబై ఎయిర్ పోర్టులో రూ. కోట్లు విలువ చేసే డ్రగ్స్ లభ్యం

ముంబై ఎయిర్ పోర్టులో రూ. కోట్లు విలువ చేసే డ్రగ్స్ లభ్యం

ముంబై విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. కొకైన్ ను అక్రమంగా తరలిస్తున్నారని పక్కా సమాచారం రావడంతో పోలీసులు పకడ్బందీగా తనిఖీ నిర్వహించారు. అడిస్‌ అబాబా (థాయ్‌) మహిళ  నుంచి రూ. 40 కోట్ల విలువ చేసే కొకైన్‌ను డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.  మహిళను అధికారులు ముంబై ఎయిర్‌పోర్ట్‌లో అదుపులోకి తీసుకున్నారు.  

తెల్లటి పొడి లాంటి పదార్థాన్ని కలిగిన కొన్ని ప్యాకెట్లు ఆమె ట్రాలీ బ్యాగ్‌లో దొరికాయని వాటిని పరిశీలిస్తే డ్రగ్స్ అని తెలిసిందని అధికారులు తెలిపారు.  పట్టుబడిన కొకైన్‌ విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో సుమారు రూ.40 కోట్లుగా ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. మహిళపై నార్కోటిక్‌ డ్రగ్స్‌ అండ్‌ సైకోట్రోపిక్‌ సబ్‌స్టాన్సెస్‌ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు.