నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. నైజీరియన్ల నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న ఓ ప్రేమ జంట బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ లోని పలు ప్రముఖులకు అధిక ధరలకు అమ్ముతుందని తెలిసింది.
ఈ ఘటనలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ప్రియురాల్ని అరెస్టు చేశారు. ప్రియుడి కోసమే ఆమె డ్రగ్స్ విక్రయిస్తున్నట్టు వారు చెబుతున్నారు. ఆమె దగ్గర్నుంచి 9 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. తొమ్మిది సంవత్సరాల నుంచి ఆ ప్రేమజంట డ్రగ్స్ విక్రయిస్తున్నట్టుగా పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.