గండిపేట, వెలుగు: రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు గురువారం జాయింట్ ఆపరేషన్ నిర్వహించి ఎండీఎంఏ, గంజాయి స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరు నుంచి సంతోష్, సందీప్, శివకుమార్ డ్రగ్స్ తీసుకువచ్చారు. రాజేంద్రనగర్లో వాటిని కొనేందుకు సాయిబాబు, విశాల్రెడ్డి, సమీర్ రాగా.. ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నారు. రూ.2 లక్షల 18 గ్రాముల ఎండీఎంఏ, 130 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
కంటోన్మెంట్లో ముగ్గురు అరెస్ట్..
కంటోన్మెంట్: బొల్లారం ముత్యాలమ్మ దేవాలయం సమీపంలో గంజాయి విక్రయిస్తున్న భరత్, ఉమేశ్, శశికాంత్ను డీటీఎఫ్ సీఐ సౌజన్య ఆధ్వర్యంలో పట్టుకున్నారు. నిందితుల వద్ద 3.2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
డ్రగ్స్ సేవించి వ్యక్తి మృతి..
గండిపేట: అధిక మోతాదులో డ్రగ్స్ తీసుకుని ఓ వ్యక్తి మృతిచెందాడు. శివరాంపల్లికి చెందిన అహ్మద్ అలీ బుధవారం రాత్రి ఫ్రెండ్స్ కలిసి పార్టీ చేసుకొని డ్రగ్స్ అధికంగా తీసుకున్నాడు. దీంతో అతడు మృతిచెందాడు. మరో ఇద్దరికి పోలీసులు పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చింది. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.
