హైదరాబాద్లో డ్రగ్స్ అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్

హైదరాబాద్లో డ్రగ్స్ అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్

హైదరాబాద్ గచ్చిబౌలి విప్రో సర్కిల్ వద్ద డ్రగ్స్ అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వారివద్ద నుంచి రూ. 8.5 లక్షల విలువగల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. వాటితో పాటు 75 గ్రాముల చెరస్.. ఒక కేజీ 40 గ్రాముల గంజాయి ఒక మోటార్ బైక్ ను సీజ్ చేశారు. నిందితులు రాజస్థాన్ కు చెందిన నీలేష్, మనీష్ గా పోలీసులు గుర్తించారు.

వీరు వివిధ ప్రాంతాల నుంచి గంజాయి మత్తు పదార్థాలను తక్కువ ధరకు తెచ్చి హైదరాబాద్ లో ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నారని పోలీసులు వెల్లడించారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తలించామన్నారు పోలీసులు.