హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల అంశంపై ప్రజల్లో గందరగోళం కలిగించే విధంగా కొన్ని పత్రికల్లో వస్తున్న కథనాలను నమ్మొద్దని అన్నారు జిహెచ్ఎంసీ కమిషనర్ డీఎస్ లోకేష్ కుమార్. ఎన్నికల నిర్వహణ ప్రక్రియ సజావుగానే జరుగుతుందని, 2016 ఎన్నికల్లో అమలు చేసిన డివిజన్ లు, రిజర్వేషన్స్ లో ఎలాంటి మార్పులు ఉండవని అన్నారు. 2014 ఎన్నికలలో ఉన్న రిజర్వేషన్ లు, వార్డులు యథావిధిగా కొనసాగుతాయని అన్నారు.
రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు, మార్గదర్శకాలకు లోబడి ఈ ఏడాది జరిగిన స్పెషల్ సమ్మరీ రివిజన్ ఆధారంగా ఎన్నికల ఓటరు జాబితా రూపొందుతుందన్నారు లోకేష్ కుమార్. ఆ మేరకు ఈ సారి కూడా జిహెచ్ఎంసి ఎన్నికలు జరుగుతాయని అన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడేంత వరకు ఓటరుగా నమోదు చేసుకున్న వారందరూ ఓటరు జాబితాలో ఉంటారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు లోబడి వార్డులు పోలింగ్ స్టేషన్ లు వారిగా ఓటరు జాబితా రూపొందించడం జరుగుతుందన్నారు. జిహెచ్ఎంసి ఎన్నికల నిర్వహణ అంశం పై అనధికారిక వార్తలను విశ్వసించరాదని లోకేష్ కుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.