
నేటి నుంచి అక్టోబర్ 3వరకు ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు ప్రభుత్వం దసరా సెలవులు ప్రకటించడంతో శనివారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రధాన బస్టాండ్లు స్టూడెంట్స్తో కిక్కిరిసిపోయాయి. గురుకులాలు, ప్రైవేట్ రెసిడెన్షియల్ లో చదువుకుంటున్న విద్యార్థులను శనివారం స్కూల్ ముగియగానే తల్లిదండ్రులు వచ్చి తీసుకెళ్లారు.
బస్టాండుల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండడంతో పిల్లల్ని, లగేజ్ తీసుకెళ్లేందుకు తల్లిదండ్రులు అవస్థలు పడ్డారు. బస్సులు బస్టాండ్కు వచ్చిన వెంటనే ప్రయాణికులతో నిండిపోయాయి. సీట్ల కోసం బస్సు కిటికిల్లోనుంచి బ్యాగులు, పిల్లలను ఎక్కించడం కనిపించింది. - ఖమ్మం ఫొటోగ్రాఫర్, వెలుగు