ఈ కార్ రేసు కేసులో కీలక మలుపు..

 ఈ కార్ రేసు కేసులో కీలక మలుపు..

తెలంగాణలో ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలకపరిణామాలు చోటు చేసుకున్నాయి.. ఐఏఎస్ అరవింద్ కుమార్‌ను ఈ రోజు ( జులై 3)  ఉదయం 11:30 గంటలకు ఏసీబీ అధికారులు   విచారించనున్నారు. ఇప్పటికే  ఈ కేసులో .. బీఆర్​ఎస్​ నేత కేటీఆర్​ను కూడా విచారించారు.  కేటీఆర్ ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా అరవింద్‌కుమార్‌ను అధికారులు ప్రశ్నించే అవకాశం ఉందని సమాచారం అందుతోంది.  దాదాపు నెల రోజుల పాటు విదేశాల్లో ఉండి జూన్ 30న హైదరాబాద్‌కు అరవింద్ కుమార్  వచ్చారు.

గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఫార్ములా ఈ కార్‌ ఈ రేస్ నిర్వహణ సంస్థకు హెచ్‌ఎండీఏ చెల్లింపులు జరిపింది. అయితే ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించి విదేశీ కంపెనీకి నగదు బదిలీ అయిందని.. దాదాపు రూ.55 కోట్లు దుర్వినియోగం జరిగినట్లు ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ముగ్గురిపై ఏసీబీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఏ1గా మాజీ మంత్రి కేటీఆర్, ఏ2గా సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, ఏ3గా హెచ్‌ఎండీఏ మాజీ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డిల పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చిన సంగతి విదితమే.  అయితే, ఈ కారు కేసులో ఫెమా నిబంధనలు ఉల్లఘించినట్టు ఈడీ పేర్కొంది.