
ఈ-స్మార్ట్గా బిజినెస్
సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్లే అడ్డాగా వ్యాపారం
ఇన్వెస్ట్మెంట్, రెంట్, మెయింటెనెన్స్ గురించి నో ఫికర్
లాక్ డౌన్ తర్వాత సిటీలో నయా ట్రెండ్
హైదరాబాద్, వెలుగు: బిజినెస్ చేయాలంటే లక్షల్లో పెట్టుబడి, కమర్షియల్ స్పేస్, ఎక్స్ పీరియన్స్, కస్టమర్లతో డీలింగ్ అబ్బో చాలా కష్ట పడాలి. రిస్క్ చేస్తే గానీ వ్యాపారం చేయలేమన్నది ఎప్పటి నుంచో ఉన్న మాటే. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఒక మంచి ఐడియా ఉంటే చాలు. ఏ రిస్క్ లేకుండా తెలివిగా బిజినెస్ చేయొచ్చు. పెద్దగా పెట్టుబడి కూడా అవసరం లేదు. స్మార్ట్ ఫోన్ ఉందా? చాలు అదే మీ బిజినెస్ కు పెట్టుబడి. ఎక్కడున్నా సరే ఈ- స్మార్ట్ గా సంపాదించేయొచ్చు. కొత్తగా మొదలైన ఈ ట్రెండ్ ను ఇప్పుడు సిటీలో జనాలు తమకు అనుకూలంగా మార్చేసుకుంటున్నారు. ఎవరికీ వాళ్లే సొంత బ్రాండ్ తో మార్కెట్లో పాపులర్ అయ్యేందుకు ఈ కామర్స్ బిజినెస్ను దున్నేస్తున్నారు. సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లనే బిజినెస్ అడ్డాలుగా చేసుకుంటూ వెబ్ సైట్ లింక్ లతో ప్రొడక్ట్స్ అమ్మేస్తున్నారు.
ఖర్చే లేకుండా..
సిటీలో చిన్న వ్యాపారం స్టార్ట్ చేయాలన్న పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ మెంట్ కావాలి. బిజీగా ఉండే కమర్షియల్ ఏరియాలో స్పేస్ కోసం రెంట్, మెయింటెనెన్స్ కే లక్షల్లో ఖర్చవుతుంది. ఆ తర్వాత కూడా బిజినెస్ సక్సెస్ అవుతుందా లేదా అని టెన్షన్ పడాలి. ఇలాంటి ఇబ్బందుల్లేకుండా ఆన్ లైన్ ను బిజినెస్ కు అడ్డాగా మార్చుకుంటున్నారు. బయట దొరికే వస్తువులనే ఆన్ లైన్ లో పెట్టేసి కాస్త కమిషన్ మీద అమ్మేస్తున్నారు. ఇందుకోసం ఎలాంటి రెంట్, మెయింటెనెన్స్ అవసరం లేదు. ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్, వాట్సాప్ లలో ప్రొడక్ట్స్ ను షేర్ చేస్తూ వాటిని కావాలని అడిగినా వారికి ఆన్ లైన్ పే మెంట్ తీసుకొని కొరియర్ చేస్తున్నారు. హోల్ సేల్ వ్యాపారుల నుంచి ఆన్ లైన్ లోనే కొని కాస్త కమీషన్ కు రిటైల్ గా అమ్ముతున్నారు. ఇలాంటి వారికి వేలల్లో కస్టమర్స్ ఉంటున్నారు. కాస్త పెట్టుబడితో లక్షల్లో సంపాదిస్తున్నారు.‘20 వేలతో బిజినెస్ స్టార్ట్ చేశాను. సూరత్ నుంచి బట్టలు తెప్పించి ఆర్డర్ చేసుకున్నవారికి డెలివరీ చేస్తుంటా. కస్టమర్ల నుంచి వాట్సాప్, ఇన్ స్టా గ్రామ్ లో ఆర్డర్లు వస్తాయి. వాటిని బట్టి ఎప్పటికప్పుడు తెప్పిస్తా. ఇందుకోసం కొందరు వెండర్స్ తో టై అప్ అయ్యాను. పెట్టిన పెట్టుబడి కంటే రెండింతలు ఎక్కువే ఆదాయం వస్తుంది.’ అని కూకట్ పల్లి కి చెందిన శైలజ తెలిపారు.
ఢిపరెంట్గా ప్రమోషన్
కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు అందరికీ రీచ్ అవ్వాలంటే ముందుగా ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి చెప్తున్నారు. అలా ఒకరి నుంచి ఒకరికి సమాచారం వెళుతుంది. మౌత్ పబ్లిసిటీ వల్ల సక్సెస్ అయ్యే బిజినెస్ లు చాలా అరుదు. మాములుగా అయితే ఒక స్టోర్ ఏర్పాటు చేసి దాన్ని ఒక సెలబ్రెటీతో ఓపెన్ చేయించి ప్రమోట్ చేసుకుంటుంటారు. ఇప్పుడు అంతా ఆన్ లైన్ బిజినెస్ కావడంతో ప్రమోషన్స్ కూడా అంతే డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నారు. తాము చేస్తున్న బిజినెస్ గురించి అతి తక్కువ టైంలో ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా సెలబ్రిటీలతో ప్రమోషన్స్ చేయించుకుంటున్నారు. సోషల్ మీడియాలో సెలబ్రిటీలకు లక్షలు, కోట్లలో ఫాలోవర్లు ఉంటారు. ఆ ఫాలోవర్లను తమ కస్టమర్లుగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు వ్యాపారులు. తమ ప్రొడక్ట్స్ ని స్టార్ లకు ఫ్రీ గా పంపిస్తున్నారు. సెలబ్రిటీలను వాటిని యూజ్ చేస్తూ వీడియో రూపంలో, ఫొటో రూపంలో తమ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో పెట్టి తమకు ప్రొడక్ట్స్ పంపిన వారిని ట్యాగ్ చేసి పోస్ట్ చేస్తున్నారు. ఇలా ఐడియాలతో పాటు ప్రమోషన్స్ లోనూ కొత్తదనం చూపిస్తూ దూసుకుపోతున్నారు.
లాక్ డౌన్ తర్వాతే
ఆన్ లైన్ బిజినెస్ లోకి చాలా మంది లాక్ డౌన్ కారణంగానే ఎంటరయ్యారు. గతేడాది కరోనాతో దాదాపు 6 నెలల పాటు జనం బయటకు వెళ్లేందుకు భయపడ్డారు. ఈ టైమ్ లో ఇంట్లోంచే ఏ వస్తువు కావాలన్న ఆన్ లైన్ లో సెర్చ్ చేయటం మొదలు పెట్టారు. బయటకు వెళ్లకుండా
కావాల్సిన ఐటమ్స్ కొనేందుకు ప్రయత్నించారు. చాలా మంది ఇంట్లోంచే షాపింగ్ చేయటంతో ఆన్ లైన్లో బిజినెస్కు డిమాండ్ పెరిగింది.
దీంతో కొంతమంది యూత్ మీడియేటర్లుగా ఉంటూ బిజినెస్ షురూ చేసి ఫుల్ సక్సెస్ అయ్యారు.
అన్నీ ఆన్ లైన్లోనే
ఆన్ లైన్లో ఒకటి, రెండు అని కాదు అన్ని రకాల వ్యాపారాలను నిర్వహిస్తున్నారు. ఇళ్లలో ఉండే మహిళలు, యూత్ ఆన్ లైన్ బిజినెస్ చేస్తున్నారు. ఏ టు జెడ్ సర్వీసులను అందుబాటులోకి తెస్తున్నారు. జ్యువెలరీ, యాక్సెసరీస్, క్లాత్స్, కిచెన్ వేర్, గ్రాసరీ, డ్రై ఫ్రూట్స్, ఇంటీరియర్ డెకరేటివ్ ఐటమ్స్, ప్లాంట్స్, ఫుడ్, ఇల్లు, కమర్షియల్ స్పేస్ లకు అవసరమైన ఎలక్ట్రానిక్ వస్తువులు, గ్యాడ్జెట్స్, స్పేర్ పార్ట్స్ ఇలా విభిన్న రకాల వ్యాపారాలు చేస్తున్నారు. హోల్ సేలర్స్ నుంచి కొని ఆన్ లైన్ లో అమ్మేస్తున్నారు. కస్టమర్లతో సపరేట్ గా వాట్సాప్ గ్రూప్ లు ఏర్పాటు చేసి ఆర్డర్లు తీసుకుని క్వాలిటీ ప్రొడక్ట్స్ ని అందిస్తున్నామని ఇలాంటి వ్యాపారం చేస్తున్న వాళ్లు చెబుతున్నారు.
ఇష్టాన్నే బిజినెస్గా మార్చుకున్నా
నాకు గ్యాడ్జెట్స్ అంటే చాలా ఇష్టం. మార్కె ట్లోకి వచ్చే కొత్త కొత్త గ్యాడ్జెట్స్, మోడల్స్ ఫాలో అవుతుంటా ను. ఆ ఇష్టాన్నే లాక్ డౌన్లో బిజినెస్గా మార్చుకున్నాను. నాకు తెలిసిన కొంతమంది సప్లయర్స్ ద్వారా డిఫరెంట్ యాక్ససరీస్, ఇయర్ బడ్స్, ఎయిర్ పాడ్స్ అవసరం ఉన్న మేరకు తెప్పించి ఇక్కడ సేల్ చేస్తున్నాను. నాకు తెలిసిన వాళ్ళు, వాళ్లకు తెలిసిన వాళ్ళు కొంటున్నారు. మౌత్ పబ్లిసిటీ ద్వారానే బిజినెస్ పికప్ అవుతోంది.
- రమేష్, కొండాపూర్
మంచి ప్రాఫిట్ వస్తోంది
అక్టోబర్లో ఆన్ లైన్ బిజినెస్ స్టార్ట్ చేశాం. ముందు ఇన్స్టాలో పేజ్ క్రియేట్ చేశాం. అందులో మేం ఏమేం సేల్ చేయబోతున్నా మో పిక్స్ పెట్టాం. జ్యు వెలరీ, క్లాత్స్ ఫొటోలు పెట్టి వాటి డీటెయి ల్స్, మా కాంటాక్ట్ ఇస్తున్నాం. ఈ మధ్యనే సెలబ్రెటీలతో ప్రమోషన్స్ మొదలు పెట్టాం. బిజినెస్ మంచిగా రన్ అవుతోంది.
– పి.కవిత, మాసబ్ ట్యాంక్
For More News..
పుట్టిన తెల్లారే పాపకు ఎక్మో ట్రీట్మెంట్..
కుక్కలకు బర్త్ కంట్రోల్ సర్జరీలు
పాల డెయిరీలో రూ. 50 కోసం గొడవ.. యువకుడు మృతి