ముగిసిన ఎర్త్ ఫౌండేషన్ స్కిల్స్ ప్రోగ్రాం

ముగిసిన ఎర్త్ ఫౌండేషన్ స్కిల్స్ ప్రోగ్రాం

జనగామ అర్బన్, వెలుగు : జనగామ జిల్లా కేంద్రంలో ధర్మకంచ జడ్పీహెచ్ఎస్ లో ఆదివారం ఎర్త్​ ఫౌండేషన్​ స్కిల్స్​ ప్రోగ్రాం ముగింపు కార్యక్రమం భూతాల వెన్నెల అధ్యక్షత నిర్వహించగా చీఫ్​ గెస్ట్​గా జనగామ అథ్లెటిక్స్​ అసోసియేషన్​ అధ్యక్షుడు పెద్ది వెంకటనారాయణ గౌడ్​ పాల్గొని మాట్లాడారు. ఏడాది పాటు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నైపుణ్యాలు అభివృద్ధి చేయడం గొప్ప విషయమన్నారు.

ఫౌండేషన్​ ఫౌండర్​ కలవేణి శ్రీనివాస్​ మాట్లాడుతూ ఎర్త్​ యాప్స్ అసోసియేట్స్ వారి సహకారంతో ఉన్నత పాఠశాలలో చదివే పిల్లలకు స్పోకెన్​ ఇంగ్లీష్​, కంప్యూటర్​, మొబైల్​ సైన్స్​ల్యాబ్, మోటివేషన్​ క్లాసెస్ లాంటి సేవలు అందించినట్లు చెప్పారు. అనంతరం ఎర్త్​ ఫౌండేషన్​ గతేడాది దత్తత తీసుకున్న ఆరు ఉన్నత పాఠశాలల విద్యార్థులకు కబడ్డీ, సైన్స్​ ఎక్స్​ఫైర్​మెంట్, స్పీచ్, ఎస్సే రైటింగ్​ అంశాల పైన కాంపిటేషన్స్ ను ఘనంగా నిర్వహించి, గెలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.