జాతీయస్థాయి పర్యాటక కేంద్రంగా భద్రకాళి టెంపుల్ : ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి

జాతీయస్థాయి పర్యాటక కేంద్రంగా భద్రకాళి టెంపుల్ : ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి

వరంగల్‍/ వర్ధన్నపేట (ఐనవోలు)/ టేకులపల్లి, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉమ్మడి వరంగల్, ​ఖమ్మం జిల్లాల్లో ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక జోరుగా సాగుతోంది. ఇందులో భాగంగా గ్రేటర్​ వరంగల్​లోని భద్రకాళి చెరువు సుందరీకరణ పనులను పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్​రెడ్డి గ్రేటర్​ మేయర్​ గుండు సుధారాణి, హనుమకొండ కలెక్టర్​ చాహత్​ బాజ్​పాయ్​తో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఓరుగల్లు భద్రకాళి ఆలయాన్ని జాతీయస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దబోతున్నట్లు తెలిపారు. రూ.16.10 కోట్లతో భద్రకాళి చెరువు పూడికతీతను సమగ్రంగా చేపడుతున్నామన్నారు. హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పంతిని గ్రామంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్​ నాగరాజు పశువులకు ఉచిత టీకాల కార్యక్రమాన్ని ప్రారంభించారు.

భద్రాద్రికొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం లచ్చగూడెం, ముత్యాలంపాడు క్రాస్​ రోడ్డు గ్రామాల్లో నిర్వహిస్తున్న ప్రజాపాలన కార్యక్రమంలో అడిషనల్​ కలెక్టర్, డిప్యూటీ కమిషనర్​ విద్యాలత, జిల్లా గ్రామీణాభివృద్ధి ఆఫీసర్​ విద్యా చందనలు పాల్గొన్నారు. ముత్యాలంపాడు రైతువేదికలో నిర్వహించిన వార్డు సభ్యుల శిక్షణ కార్యక్రమంలో పాల్గొని పలు సూచనలు చేశారు.