తూ.గో జిల్లాలో బస్సు దగ్ధం.. షార్ట్ సర్క్యూట్ తో చెలరేగిన మంటలు..

తూ.గో జిల్లాలో బస్సు దగ్ధం.. షార్ట్ సర్క్యూట్ తో చెలరేగిన మంటలు..

తూర్పుగోదావరి జిల్లాలో  బస్సు ప్రమాదం జరిగింది.  కొవ్వూరు హైవేపై  షార్ట్​ సర్కూట్​తో బస్సు దగ్ధమైంది. RRR ట్రావెల్స్​ కు చెందిన  బస్సులో మంటలు చెలరేగాయి.  కొవ్వూరు గామన్​ బ్రిడ్జి సమీపంలో  ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న ఫైర్​ సిబ్బంది  మంటలను అదుపు చేశారు.  మంటలకు బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఖమ్మం నుంచి విశాఖపట్నం వెళుతుండగా ప్రమాదం జరిగింది.  డ్రైవర్​ అప్రమత్తతో  ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి హాని జరగలేదని అధికారులు తెలిపారు.  ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 10 మంది ప్రయాణికులు ఉన్నారు. 

 సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపు చేశారు. అయితే అప్పటికే బస్సు మొత్తం మంటల్లో కాలిపోయింది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ప్రయాణికులు అందరూ సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. కానీ ప్రయాణికులకు సంబంధించిన లగేజ్‌లు మాత్రం బస్సులో ఉండిపోయినట్టు తెలుస్తోంది.