ఈటల వల్ల పదవులు పొంది.. ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారు

ఈటల వల్ల పదవులు పొంది.. ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారు

ఈటల రాజేందర్ వెంట ఉండి పదవులు తెచ్చుకున్న వాళ్లు ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఈటల అనుచరుడు,  కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ 3వ వార్డు కౌన్సిలర్ రవీందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భూకబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి ఈటలపై టీఆర్ఎస్ నేతలు విమర్శలు చేయడం తగదని ఆయన అన్నారు. 

‘పొనగంటీ మల్లయ్య అనే నాయకుడు అనేక పార్టీలు తిరిగి ఇప్పుడు టీఆర్ఎస్‌లోకి వచ్చి ఈటలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఆయన భార్యకు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి, మల్లయ్యకు కౌన్సిలర్ బీ ఫారం ఇచ్చి గెలిపిస్తే.. ఇప్పుడు ఈటలనే వ్యతిరేకిస్తున్నారు. పార్టీలో ఎంతోమంది సీనియర్లు ఉన్నా.. మల్లయ్యకు ఈటల పదవులు కట్టబెడితే ఇప్పుడు రివర్స్‌లో మాట్లాడుతున్నారు. పరిపాటి రవీందర్ రెడ్డి అనే  మరో సీనియర్ నేత టీఆర్ఎస్ పార్టీకి కట్టుబడి ఉంటామని మాట్లాడటం హాస్యాస్పదం. మధ్యలో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లి వచ్చిన ఈయన.. పార్టీ గురించి మాట్లాడటం విచిత్రంగా ఉంది. 
ఈటలపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదు. నోరు అదుపులో పెట్టుకుంటే అందరికి మంచిది’ అని రవీందర్ హెచ్చరించారు.