గజ్వేల్ లోనే పోటీ చేస్తా.. కేసీఆర్ ను ఓడిస్తా

గజ్వేల్ లోనే  పోటీ చేస్తా.. కేసీఆర్ ను ఓడిస్తా

ఫాంహౌస్ లో పడుకున్న కేసీఆర్ ను ప్రగతి భవన్ కు ఈడ్చుకొచ్చామని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ వేసిన ఈటల రాజేందర్.. కేసీఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నారన్నారు. తన రాజకీయ జీవితంలో పరుష పదజాలాలు ఏనాడు లేవని..  తన గురించి కేసీఆర్ చిల్లరగా మాట్లాడారని ధ్వజమెత్తారు. తనకు సహనం, సంస్కారం, ఓపిక ఉందన్నారు. డబ్బుతో గెలవొచ్చనే భ్రమలో కేసీఆర్ ఉన్నారన్నారు. ధనవంతులకు రైతుభందు ఎందుకని తాను ప్రశ్నించానని.. ఈ విషయం ఎన్నోసార్లు ముఖ్యమంత్రికి చెప్పామన్నారు. తాము ఉద్యమకారులమని..బానిసలం కాదన్నారు. ఎప్పుడూ భయపడి వెనకడుగు వేయబోనన్నారు.

ప్రతీదాన్ని ప్రశ్నించినందుకే తనను పార్టీ  నుంచి వెళ్లగొట్టారని ఈటల అన్నారు. తనను ఓడించానికి 13 మంది మంత్రులు పనిచేశారన్నారు. అధికార యంత్రాంగాన్ని  మొత్తం హుజురాబాద్ లో పెట్టిండన్నారు. కేసీఆర్ ను ఓడిస్తేనే రాష్ట్రానికి పట్టిన శని పోతుందన్నారు..కేసీఆర్ కు విసిరిన చాలెంజ్ కు తాను కట్టుబడి ఉన్నానని అన్నారు. గజ్వేల్ ప్రజలు కేసీఆర్ ను ఓడించేందుకు సిద్భంగా ఉన్నారని చెప్పారు.  కేసిఆర్ ను రాజకీయంగా బొంద పెట్టేది తానే అని ఈటల సవాల్ విసిరారు. మొకాలంతోన్నే కావొచ్చు .. మోకాలంతే ఉండొచ్చని.. చిన్నోన్నే కావొచ్చు కానీ..తాను బుల్లెట్ లాంటోన్ని అని  అన్నారు.  బుల్లెట్ కూడా ఇంచంతే ఉంటుందని.. దించితే గుండెల్లోకి వెళ్తుందని కేసీఆర్ కు గట్టి కౌంటర్ వేశారు ఈటల రాజేందర్.