సీఎం జగన్ పై దాడి ఘటన:సీరియస్ గా తీసుకున్న ఈసీ.. కీలక నాయకుల సభల్లో భద్రత పెంపు...

సీఎం జగన్ పై దాడి ఘటన:సీరియస్ గా తీసుకున్న ఈసీ.. కీలక నాయకుల సభల్లో భద్రత పెంపు...

శనివారం విజయవాడలో సీఎం జగన్ పై జరిగిన దాడి ఘటన రాష్ట్రంలో కలకలం రేపింది. ఈ ఘటనపై ఎన్నికల కమిషన్ తీవ్రంగా స్పందించింది. సీఎం సభలో భద్రతా వైఫల్యం ఏంటని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల అధికారి పోలీసు అధికారులకు కొన్ని సూచనలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పార్టీల నాయకుల బహిరంగ సభలో, యాత్రలో భద్రతను పెంచాలని ఆదేశాలు జారీ చేశారు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి.

ఈ ఘటనపై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. దాడి వెనుక టీడీపీ కుట్ర ఉందని, జగన్ సభలకు వస్తున్న స్పందన చూసి ఓర్వలేక ఈ కుట్రకు ప్లాన్ చేశారని ఆరోపిస్తున్నారు. మరో పక్క ఇదంతా వైసీపీనే ప్లాన్ చేసిందని, సింపతీ కోసం ఆడుతున్న డ్రామా అని ఆరోపిస్తున్నారు.కాగా, ఘటనపై దర్యాప్తును ముమ్మరం చేశారు పోలీసులు. వీలైనంత త్వరగా నిందితులను గుర్తించే ప్రయత్నంలో ఉన్నారు పోలీసులు.