
అక్రమ సంపాదనను, ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అటాచ్ చేసిన, చేస్తున్న సందర్భాలను చూస్తూనే ఉన్నాం. కానీ, ఇదో కొత్త కేసు. మూడు చింపాంజీలు, నాలుగు మార్మోసెట్ల (కోతి జాతికి చెందిన జంతువు)ను ఈడీ అటాచ్ చేసింది. ఒక్కో చింపాంజి విలువ రూ. 25 లక్షలట. ఒక్కో మార్మోసెట్ లక్షన్నర విలువ ఉంటుందట. మొత్తంగా రూ.81 లక్షలట వాటి విలువ. కోల్కతాకు చెందిన సుప్రదీప్ గుహ అనే వ్యక్తి వీటిని అక్రమంగా ఇంట్లో పెంచుకుంటున్నాడన్నది ఆరోపణ. స్థానిక కోర్టులో వైల్డ్లైఫ్ డిపార్ట్మెంట్ వైల్డ్లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద కేసు పెట్టింది. ఫోర్జరీ చేసిన పర్మిషన్ లెటర్తో డాక్యుమెంట్లను తయారు చేసినందుకు గానూ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఆ కేసు ఈడీ చేతికి రావడంతో ఆ జంతువులను అటాచ్ చేసింది.