ముంబై: శివసేన ఎంపీ సంజయ్ రౌత్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు షాకిచ్చారు. రౌత్తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు చెందిన ఆస్తులు అటాచ్ చేసింది. ఈడీ స్వాధీనం చేసుకున్న వాటిలో సంజయ్ రౌత్తో పాటు ఆయన కుమారుడికి చెందిన ఆస్తులు ఉన్నాయి. ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ ప్రకారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అలీబాగ్లోని 8 ప్లాట్లు, దాదర్ ప్రాంతంలోని ఓ ఫ్లాటును స్వాధీనం చేసుకుంది. వెయ్యి కోట్ల విలువైన పట్రాచాల్ భూ కుంభకోణానికి సంబంధించి ఈడీ ఈ నిర్ణయం తీసుకుంది.
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తమ ఆస్తులు అటాచ్ చేయడంపై సంజయ్ రౌత్ స్పందించారు. తాను బాలాసాహెబ్ థాక్రే అనుచరుడు, శివ సైనికుడినైన తనను ఆస్తులు సీజ్ చేసి, తుపాకీతో బెదిరింది, జైలుకు పంపి ఎవరూ భయపెట్టలేరని అన్నారు. తాను ఏమాత్రం మౌనంగా ఉండనని, ప్రతి ఒక్కరి భాగోతాన్ని బయటపెడతానని హెచ్చరించారు. త్వరలోనే నిజాలు బయటకు వస్తాయని సంజయ్ రౌత్ ధీమా వ్యక్తం చేశారు.
#WATCH "... I'm not one to get scared, seize my property, shoot me, or send me to jail, Sanjay Raut is Balasaheb Thackeray's follower & a Shiv Sainik, he'll fight & expose everyone. I'm not one to stay quiet, let them dance. The truth will prevail": Shiv Sena leader Sanjay Raut pic.twitter.com/UzIdBKN9mc
— ANI (@ANI) April 5, 2022
ఈడీ ఆస్తులు అటాచ్ చేయడానికి కొన్ని గంటల ముందే సంజయ్ రౌత్ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడికి లేఖ రాశారు. పట్రాచాల్ భూ కుంభకోణానికి సంబంధించి ఈడీ తన అధికారాలను దుర్వినియోగం చేస్తోందని లేఖలో పేర్కొన్నారు. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సహా కేంద్ర దర్యాప్తు సంస్థలన్నీ ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తున్నాయని రౌత్ ఫిర్యాధు చేశారు.