ఢిల్లీలో 25 చోట్ల ఈడీ దాడులు

ఢిల్లీలో 25 చోట్ల ఈడీ దాడులు

న్యూఢిల్లీ : ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు దర్యాప్తులో భాగంగా ఎన్‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మళ్లీ 25 చోట్ల దాడులు నిర్వహించింది. ఢిల్లీలోని లిక్కర్ డీలర్–షిప్, డిస్ట్రిబ్యూటర్ల ఇండ్లు, వారికి చెందిన ఇతర ప్రదేశాల్లో శుక్రవారం సెర్చ్ ఆపరేషన్ జరిగిందని అధికారులు తెలిపారు. ఈ కేసులో ఈడీ ఇప్పటివరకు అనేక చోట్ల దాడులు నిర్వహించింది.

గత నెలలో లిక్కర్ మేకర్ కంపెనీ ఇండోస్పిరిట్ ఎండీ సమీర్ మహేంద్రును అరెస్టు చేసింది. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, మరికొందరిని నిందితులుగా పేర్కొంటూ సీబీఐ ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐఆర్‌‌‌‌‌‌‌‌ నమోదు చేసింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ 2021–22 అమలులో జరిగిన అవకతవకలపై ఢిల్లీ ఎల్జీ వీకే సక్సేనా గతంలో సీబీఐకి సిఫారసు చేశారు. ఈ కేసులో 11మంది ఎక్సైజ్ అధికారులు సస్పెండ్  అయ్యారు. దర్యాప్తు కొనసాగుతోంది.