న్యూఢిల్లీ: మనీ లాండరింగ్ కేసులో బాలీవుడ్ యాక్టర్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ను ఎన్ఫోర్స్మెంట్డైరెక్టరేట్(ఈడీ) నిందితురాలిగా చేర్చింది. ఈ కేసులో ఢిల్లీలోని ప్రివెన్షన్ఆఫ్మనీ లాండరింగ్యాక్ట్ (పీఎంఎల్ఏ) స్పెషల్ కోర్టులో కొత్త చార్జిషీట్ను ఈడీ ఫైల్చేసింది. ఆ చార్జిషీట్లో జాక్వెలిన్ను నిందితురాలిగా చేర్చామని ఈడీ వర్గాలు తెలిపాయి. మనీ లాండరింగ్ కేసులో ఈడీ ఆమెను ఇప్పటికే పలుమార్లు ప్రశ్నించింది. అలాగే ఏప్రిల్లో పీఎంఎల్ఏ కింద ఆమెకు చెందిన రూ.7.27 కోట్ల ఫండ్స్ను అటాచ్చేసింది. ‘‘ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సుకేశ్ చంద్రశేఖర్ దోపిడి, మోసం వంటి వివిధ నేరాలకు పాల్పడడం ద్వారా సంపాదించిన డబ్బుతో జాక్వెలిన్కు రూ.5.71 కోట్ల విలువైన గిఫ్ట్లు ఇచ్చాడు.
ఈ గిఫ్ట్లను తన సన్నిహితురాలు పింకీ ఇరానీతో ఆమెకు డెలివరీ చేయించాడు. అంతేకాకుండా ఈ కేసులో నిందితుడు, హవాలా ఆపరేటర్ అవతార్ సింగ్ కొచ్చార్తో జాక్వెలిన్ ఫ్యామిలీ మెంబర్లకు రూ.1.3 కోట్ల నిధులు, రూ.14 లక్షల విలువైన కారును కూడా సుకేశ్ ఇప్పించాడు. అలాగే వెబ్ సిరీస్ ప్రాజెక్టు కోసం స్ర్కిప్ట్ రాయడానికి జాక్వెలిన్ తరపున ఓ రైటర్కు సుకేశ్రూ.15 లక్షలు అందించాడు. ఫోర్టిస్ హెల్త్కేర్ ప్రమోటర్ శివిందర్ మోహన్ సింగ్ భార్య అదితి సింగ్ వంటి హైప్రొఫైల్ వ్యక్తులను మోసం చేయడం ద్వారా సుకేశ్ ఆ డబ్బు సంపాదించాడు. పార్టీ పేరిట ఫండ్స్ పేరుతో వారి నుంచి రూ.200 కోట్లు కాజేసిండు” అని ఈడీ ఆఫీసర్లు పేర్కొన్నారు. సుకేశ్ తనకిచ్చిన గిఫ్ట్లు నేరాలకు పాల్పడడం ద్వారా వచ్చినవేనన్న విషయం జాక్వెలిన్కు తెలుసన్నారు.
ప్రియమైన నేను..
ఈడీ తనను నిందితురాలిగా చేర్చిన తర్వాత జాక్వెలిన్ ఫెర్నాండెజ్ఇన్స్టాగ్రాం అకౌంట్లో స్పందించారు. ‘‘డియర్ మి.. నాకంతా మంచే జరుగుతది. నేను పవర్ఫుల్ వ్యక్తిని. నా లక్ష్యాలు, కలల్ని అందుకుంట. ఆ సామర్థ్యం నాలో ఉంది. అంతా సర్దుకుంటది” అని జాక్వెలిన్ పోస్టు చేశారు.