కేరళ సీఎం పినరయి విజయన్ కు షాక్.. KIIFB మసాలా బాండ్ కేసులో ఈడీ నోటీసులు..

కేరళ సీఎం పినరయి విజయన్ కు షాక్.. KIIFB మసాలా బాండ్ కేసులో ఈడీ నోటీసులు..

కేరళ సీఎం పినరయి విజయన్ కు షాక్ తగిలింది. KIIFB మసాలా బాండ్ కేసులో సీఎం పినరయి విజయన్, మాజీ ఆర్థిక మంత్రి థామస్ ఇస్సాక్, సీఎం ప్రధాన కార్యదర్శి కేఎం అబ్రహం లకు నోటీసులు జారీ చేసింది ఈడీ.  ఈ కేసులో రూ. 466 కోట్ల ఫెమా ఉల్లంఘనల జరిగినట్లు ఆరోపణలు ఉన్న క్రమంలో నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు ఈడీ అధికారులు. 

ఈ కేసుకు సంబంధించి ఫెమా దర్యాప్తు ముగిసిన తర్వాత షోకాజ్ నోటీసులు జారీ చేసి.. విచారణలో తేలిన ఉల్లంఘనల మేరకు జరిమానా విధించే అవకాశం ఉంది.

KIIFB మసాలా బాండ్ కేసు ఏంటి.. ?

KIIFB మసాలా బాండ్ల ద్వారా సేకరించిన రూ. 2 వేల కోట్లకు సంబంధించిన కార్యకలాపాలు ఫెమా మార్గదర్శకాలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అన్న కోణంలో దర్యాప్తు చేస్తోంది ఈడీ. 2019లో భారతదేశంలో ఇలాంటి బాండ్లు రిలీజ్ చేసిన మొదటి రాష్ట్రం కేరళ. ఆ ఏడాది KIIFB లండన్ స్టాక్ ఎక్స్ చేంజ్ లో తన తొలి మసాలా బాండ్ జారీ చేయడం ద్వారా సుమారు రూ. 2 వేల కోట్లు సేకరించింది.

రాష్ట్ర అభివృద్ధి కోసం రూ. 50 వేల కోట్లను సమీకరించే ప్లాన్ లో భాగంగా ఈ నిధులుపలు ప్రధాన ప్రాజెక్టులకు మళ్లించింది ప్రభుత్వం.బాండ్ల ఆదాయానికి సంబంధించి నిధుల మళ్లింపు, ఫోరెక్స్ కి సంబంధించి అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి.