కోల్కతా : బెంగాల్కు చెందిన తృణమూల్కాంగ్రెస్(టీఎంసీ) నాయకుడు షాజహాన్ షేక్ కోసం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) లుకౌట్ నోటీసు జారీ చేసింది. శుక్రవారం షాజహాన్ షేక్ ఇంట్లో సోదాలు నిర్వహించేందుకు ఈడీ అధికారులు వెళ్లగా.. అతని అనుచరులు వారిపై దాడి చేశారు.
వెహికల్స్ను ధ్వంసం చేశారు. ఈ దాడిలో ముగ్గురు ఆఫీసర్లు గాయపడ్డారు. ఈ క్రమంలో షాజహాన్ షేక్ దేశం విడిచి పారిపోయే చాన్స్ఉండడంతో అతని కోసం ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు లుకౌట్ నోటీసు పంపించినట్టు ఈడీ అధికారులు తెలిపారు. బెంగాల్లో వెలుగుచూసిన కోట్లాది రూపాయల రేషన్ కుంభకోణం కేసులో గత ఏడాది అరెస్టయిన మంత్రి జ్యోతిప్రియో మల్లిక్కు షాజహాన్ షేక్ సన్నిహితుడు.