టీఎంసీ నేత షాజహాన్ కోసం ఈడీ లుకౌట్ నోటీస్​

టీఎంసీ నేత షాజహాన్ కోసం ఈడీ లుకౌట్ నోటీస్​

కోల్‌‌కతా :  బెంగాల్​కు చెందిన తృణమూల్​కాంగ్రెస్(టీఎంసీ) నాయకుడు షాజహాన్ షేక్ కోసం ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్ (ఈడీ) లుకౌట్ నోటీసు జారీ చేసింది. శుక్రవారం షాజహాన్ షేక్ ఇంట్లో సోదాలు నిర్వహించేందుకు ఈడీ అధికారులు వెళ్లగా.. అతని అనుచరులు వారిపై దాడి చేశారు. 

వెహికల్స్​ను ధ్వంసం చేశారు. ఈ దాడిలో ముగ్గురు ఆఫీసర్లు గాయపడ్డారు. ఈ క్రమంలో షాజహాన్ షేక్ దేశం విడిచి పారిపోయే చాన్స్​ఉండడంతో అతని కోసం ఎయిర్‌‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు లుకౌట్ నోటీసు పంపించినట్టు ఈడీ అధికారులు తెలిపారు. బెంగాల్​లో వెలుగుచూసిన కోట్లాది రూపాయల రేషన్ కుంభకోణం కేసులో గత ఏడాది అరెస్టయిన మంత్రి జ్యోతిప్రియో మల్లిక్‌‌కు షాజహాన్ షేక్ సన్నిహితుడు.